ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రద్దీ.. కీలక సూచనలు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 08:06 PM

ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్ని రోజులుగా తీవ్ర రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణీకులు అని చెకింగ్స్ పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక సూచనలు చేసింది. నిర్దేశిత సమయానికి మూడున్నర గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది. తమ వెంట 7 కిలోలకు మించకుండా లగేజీని తీసుకురావాలని.. ప్రయాణీకులు 5,6 గేట్ల ద్వారా టెర్మినల్ 3కి చేరుకుంటే దగ్గరవుతుందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa