తిరుపతి కొండపై దొంగలు తమ హస్తవాటం ప్రదర్శించారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద లాకర్లో ఉంచిన లగేజీ మిస్సయ్యిందంటూ కొంతమంది భక్తులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. బ్యాగుల్లో ఉంచిన 8 మొబైల్ ఫోన్లు, ఐదువేల నగదు కూడా పోయిందని వాపోతున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ అయిన టీటీడీలో ఇలాంటి ఘటనలు జరగవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన లవణం నరహరి అనే వ్యక్తి.. పుట్టువెంట్రుకలు తీయించేందుకని తిరుమలకు కుటుంబసమేతంగా వెళ్లారు. శ్రీవారి దర్శనం పూర్తైన తర్వాత.. తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయానికి దర్శనం కోసం వెళ్లారు. లగేజీని కౌంటర్లో భద్రపరిచారు. అయితే దర్శనం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత.. కౌంటర్ లోని సిబ్బంది లగేజీ పోయిందని చెప్తున్నారని బాధితులు వాపోతున్నారు.
దర్శనం త్వరగా పూర్తవుతుందనే ఉద్దేశంతో బ్యాగులోనే 8 మొబైల్ ఫోన్లు, ఐదువేల నగదు ఉంచామని చెప్తున్నారు. బ్యాగు గురించి అడిగితే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారంటూ.. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇంత పెద్ద వ్యవస్థ అయిన టీటీడీలో నమ్మకంతో లగేజీ ఉంచితే.. ఇలా జరగడం ఏంటని బాధితులు వాపోతున్నారు.
ఆలయంలో దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తమ మొబైల్స్ను లాకర్లలో భద్రపరుస్తారు. దర్శనం అనంతరం తిరిగొచ్చి తమ మొబైల్స్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన భక్తులు మొబైల్స్, ఇతర వస్తువుల్ని లాకర్లో ఉంచి వెళ్లారు. తిరిగొచ్చి చూసేసరికి కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివవాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa