భారత ఐఫోన్ యూజర్లకు యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. 5జీతో కూడిన ఐఓఎస్ అప్డేట్ ను విడుదల చేసింది. భారత్ లో ఐఓఎస్ 16.2 (iOS 16.2) పేరిట అప్డేట్ ను రిలీజ్ చేసింది. దీంతో ఐఫోన్ 14 యూజర్లతో పాటు ఇతర ఐఫోన్ యూజర్లు ఈ అప్డేట్ ద్వారా ఎయిర్టెల్, జియో నెట్వర్క్ 5జీ సేవలను పొందొచ్చు. 5జీ నెట్వర్క్ తో పాటు యాపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్ డేటాకు ఎండ్-టు- ఎండ్ ఎన్క్రిప్షన్, హోమ్ యాప్ కు సంబంధించిన పలు మార్పులను కూడా ఆపిల్ కంపెనీ చేపట్టింది. సెట్టింగ్స్లోకి వెళ్లి సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేసుకుంటే ఈ సేవలను పొందొచ్చు. మీరు ఉంటున్న ప్రాంతంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే నేటి నుంచే ఈ సేవలను పొందొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa