ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 27న వారి ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 04:24 PM

ఏపీలో నవరత్నాలు, సంక్షేమ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఈనెల 27న సంక్షేమ పథకాల ఫలాలను అందజేయనున్నారు. వివిధ పథకాల కింద 2.51 లక్షల మందికి రూ.403 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అంతేకాకుండా అదనంగా 2.43 లక్షల మందికి పెన్షన్లు, 44,543 బియ్యం కార్డులు, 14,441 ఆరోగ్యశ్రీ కార్డులు, 14,531 ఇళ్ల పట్టాలు, రూ.65 కోట్ల విలువైన సస్పీసియస్‌ అకౌంట్‌ లో ఉన్న బీమా క్లెయింలు మంజూరు చేసింది. వివిధ కారణాల వల్ల మిగిలి పోయిన, కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఏడాదికి రెండు దఫాలుగా (జూన్, డిసెంబర్‌) లబ్ధి చేకూర్చాలని గతంలో కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa