రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ పాలనకు చమర గీతం పాడే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, టిడిపి పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం నగర పంచాయతీలోని కర్ణాటక నాగేపల్లిలో నిర్వహించిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ఈనే కార్యక్రమంలో పాల్గొన్న పల్లె మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని అన్నారు. గట్టిగా నిలదీసిన నాయకులను పోలీసుల ద్వారా అరెస్టు చేస్తున్నారన్నారు. మూడున్నర ఏళ్ల పాలనలో ప్రభుత్వ పాలన చూస్తూ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ అరాచక దౌర్జన్య పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని 2024 ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, పార్లమెంటు పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, అంబులెన్స్ రమేష్, మాల మనోహర్, కరణం సుబ్రహ్మణ్యం, రాజప్ప, శ్రీరాములు, రమేష్, తెలుగు మహిళా నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa