లింగాల మండలం రామన్నూతల పల్లె, గుణకనపల్లి చిన్నకుడాల గ్రామాల లో గురువారం ఉద్యాన శాస్త్రవేత్తలు అరలి పంటను పరిశీలించారు. మాండూస్ తుఫానువల్ల కురిసిన వర్షాలకు అరటిపంటకు నష్టం వాటిల్లకుండా రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశాల. మేరకు అరటి జాతీయ పరిశోధనా కేంద్రం తిరుచ్చి నుంచి సాంకేతిక శాస్త్రవేత్తలు పల్లవిస్వామి, ముత్తు పులివెందుల అరటి పరిశోధనా కేంద్రం నుంచి ప్రధాన శాస్త్రవేత్త సుశీల, ఉద్యానశాఖ ఏడీ సుభాషిణిలు క్షేత్రస్థాయిలో అరటిపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లాడుతూ అరటిపంట సాగుచేసే విధానం గురించి తెలుసుకున్నారు. రైతులు వెలిబుచ్చిన సందేహాలను వారు నివృత్తిచేశారు. అనంతరం సాగుకు ఉపయోగపడే సలహాలు ఇచ్చారు. తుఫాను సంబవించిన సమయంలో వీచిన ఈదురుగాలుల వల్ల నేలకొరిగిన అరటిపంటను ఏవిధంగా పునరుద్ధరణ చేపట్టాలన్న అంశాలను వారు వివరించారు. అనంతరం రామన్నూతపల్లె గ్రామంలో రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్ర మంలో రామన్నూతలపల్లె వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఉద్యాన అధికారి రాఘవేంద్రారెడ్డి, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa