ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున్న ఆందోళన జరిగి ఉండదని... ఒక్క అమరావతి రైతు ఉద్యమం మాత్రమే మూడేళ్లుగా జరుగుతోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జంతర్మంతర్ వద్ద జరుగుతున్న అమరావతి రైతుల నిరసనకు ఎంపీ మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. అమరావతిని నాశనం చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకొని వెళ్తున్నారన్నారు. పరదాలు తీసి రైతుల కన్నీళ్లు జగన్మోహన్ రెడ్డి చూడాలని... ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రైతుల పట్టుదలనే రైతు ఉద్యమాన్ని ముందుకు నడుపుతోందన్నారు. అరసవెల్లిలో రైతులను ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసిందని విమర్శించారు. న్యాయస్థానాలు కూడా రాజధాని రైతులవైపే న్యాయం ఉందని చెప్పారన్నారు. పార్లమెంట్లో కూడా అమరావతి రాజధానిపై మాట్లాడుతున్నట్లు ఎంపీ రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa