ఆమదాలవలస పట్టణంలో గల స్థానిక శ్రీ వెంకట సాయి ల్యాబ్ ఆవరణలో ఆదివారం సాయంత్రం కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షులు టి భాస్కరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ 429 అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమదాలవలస నూతన కమిటీ అధ్యక్షులుగా ముద్దాడ సింహాచలం, ఉపాధ్యక్షునిగా పి రాజు ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సోమవారం స్థానిక ఆర్ఎంపీ వైద్యులు ఎండ విశ్వనాథం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa