కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఈనెల 21 నుంచి 2023 జనవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా జడ్జి అరుణ సారిక తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వివరాలను సోమవారం జిల్లా జడ్జి పేర్కొన్నారు. విజయవాడ ఎన్జీవోల కాలనీలోని విజయదుర్గా కంప్యూటర్స్, కండ్రిక ఆయాన్ డిజిటల్ జోన్, రామవరప్పాడు విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్, విజయవాడ పొట్టి శ్రీరాములు చలవాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల, విజయవాడ గవర్నర్పేట ఎస్విటి ఇన్ఫో టెక్నో, తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల, నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాల, పెడన మండలం నందమూరు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లు, ఇతర వివరాలను వెబ్సైట్లో చూడవచ్చన్నారు. సకాలంలో పరీక్షలకు హాజరు కావాలని, గేటు మూసిన తరువాత అభ్యర్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరన్నారు. హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డును తీసుకు రావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa