వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు ఏపీ సీఎం జగన్ మంగళవారంనాడు ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరిన ఆయన 11 గంటలకు దర్శి చేరుకున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడు రాజీవ్ వివాహ రిసెప్షన్ కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు రోహిత, రాజీవ్ లకు సీఎం శుభాకాంక్షలు తెలిపి, వారిని ఆశీర్వదించారు. ఈ వివాహ రిసెప్షన్ కు మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. ఇదిలావుంటే మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి తిరుగు పయనమయ్యారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సాయంత్రం విజయవాడ ఏప్లస్ కన్వెన్షన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa