పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల వయో పరిమితి 27 ఏళ్లలోపు ఉండాలని ప్రభుత్వం ప్రకటించడం దారుణమని పలు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని కోరుతూ సీఎం జగన్ చిత్రపటానికి మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభ్యర్థుల వయో పరిమితిని 32 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆవేదన వినేందుకు కూడా సీఎం ఇష్టపడటం లేదని, ఆయన్ను కలిసేందుకు ఆవకాశం లేకపోవడంతో ఆయన చిత్రపటానికి వినతిపత్రం అందజేశామన్నారు. తెలంగాణ, తమిళనాడులో రెండేళ్ల వయో పరిమితిని పెంచినట్టు చెప్పారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, పీడీఎ్సయూ జాతీయ నేత ఎ.రవిచంద్ర, ఎన్.ఎ్స.యూ.ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వేముల శ్రీనివాస్, ఏఐఎ్సఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం.సాయికుమార్, డీవైఎ్ఫఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa