వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు. తాను తెలుగు యువత నాయకుడిగా 1989 నుంచి 1994 వరకు పని చేసిన విధానం అందరికీ తెలుసు అన్నారు. పార్టీ కోసం బాగా శ్రమించామని.. 33 ఏళ్లగా పార్టీలో ఉన్నాను అన్నారు. కేవలం అధికారం కోసం ఆలపాటి రాజా టీడీపీలో లేరన్నారు.
తెనాలి సీటు తనకు ఏమీ రాసి పెట్టి లేదని.. మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక సీటు అని రాసి పెట్టలేదని.. తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేదు అంటూ బాంబ్ పేల్చారు. తాను మానసికంగా ఎప్పుడూ బలంగా ఉంటానని.. ఏ పదవి వచ్చినా స్వీకరించాను అన్నారు రాజా. ఎమ్మెల్యే అయ్యానని.. మంత్రి అయ్యాను అంటూ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాు.
తన గురించి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు రాజా. తాను ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఆ విషయం చంద్రబాబు చూసుకుంటారు అన్నారు. టీడీపీకి జనసేన పార్టీ తో పొత్తు ఉండేది, లేనిదీ అధిష్టానం చూసుకుంటుందని..
మాజీ మంత్రి ఆలపాటి రాజా తెనాలి టీడీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. ఇటు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా అదే నియోజకవర్గం నుంచి గతంలో గెలిచారు. ఒకవేళ జనసేన పార్టీ, టీడీపీల మధ్య పొత్తు ఉంటే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఆలపాటి రాజా సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు.. అటు నాదెండ్ల మనోహర్ కూడా జనసేన పార్టీలో కీలక నేత. మరి రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే ఎవరికి సీటు ఇస్తారని టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
నాదెండ్ల మనోహర్ 2004, 2009లో తెనాలి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆలపాటి రాజా 2009లో మనోహర్పై పోటీచేసి ఓడిపోయారు. 2014లో రాజా తిరిగి విజయం సాధించారు.. 2019లో వైఎస్సార్సీపీ (YSRCP), టీడీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగింది.. అక్కడ వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మరి 2024 ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటే ఎవరికి సీటు ఇస్తారన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa