ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ్ డమ్ స్కూల్ నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 07:51 PM

రైల్వేకోడూరు పట్టణం చిట్వేల్ రోడ్ నందు గల విస్డం విద్యాసంస్థల ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వేకోడూర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మెహన్ రావ్ ముఖ్య ఆతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ విశిష్టతను పిల్లలకు వివరించారు. పాఠశాల విద్యా సంస్థల కరస్పాండెంట్ ప్రదీప్ పిల్లలకు యేసుక్రీస్తు జీవిత చరిత్రను వివరించారు. తదనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పిల్లలకు పంచారు. పాఠశాల విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమం నందు విద్యాసంస్థల డైరెక్టర్ మదన్మోహన్, ప్రిన్సిపాల్ ప్రియంక పాఠశాల సిబ్బంది పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa