ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల రుణభారంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానం : కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 10:36 AM

రైతుల రుణభారంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఒక్కో రైతు కుటుంబంపై తలసరి రుణభారం రూ. 2,45,554 అప్పులు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో ప్రకటించారు. జాతీయ స్థాయిలో తలసరి అప్పు రూ. 74,121 చెప్పారు. కేరళ, పంజాబ్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉండగా... రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏపీ, కేరళ మరియు పంజాబ్. జాతీయ సగటు కంటే ఏపీ అప్పు మూడు రెట్లు, తెలంగాణ అప్పు రెండింతలు పెరగడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa