ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్ ఆస్ప‌త్రి నిర్మాణ‌ ప్రగతిపై వైవీ సుబ్బారెడ్డి సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 03:57 PM

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఆదేశాల మేర‌కు దేశంలోనే అత్యుత్తమ చికిత్సలు అందించేలా  తిరుపతిలో శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (క్యాన్సర్ ఆస్ప‌త్రి) నిర్మిస్తున్నామని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది దసరాకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా ఆస్ప‌త్రిని ప్రారంభిస్తామ‌న్నారు. క్యాన్సర్ ఆస్ప‌త్రి నిర్మాణ‌ ప్రగతిపై స్విమ్స్ లో శుక్రవారం ప్రముఖ వైద్యులు, అధికారులతో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. పేద పిల్లలు గుండె వ్యాధులతో చనిపోకుండా ఉండాలనే లక్ష్యంతో తిరుపతిలో చిన్న పిల్లల గుండె చికిత్సల ఆస్ప‌త్రి  నిర్మించాలని సీఎం ఆదేశించార‌న్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఆసుపత్రి పేదలకు గొప్ప వైద్య సేవలు అందిస్తుందని ముఖ్యమంత్రి విశ్వసించారని అన్నారు. ఆలోచన వచ్చిన నాలుగు నెలల్లోనే తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి హృదయాలయం ఏర్పాటు చేయించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారన్నారు. ఇప్పటివ‌ర‌కు వెయ్యి మందికి పైగా పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసి వారికి కొత్త జీవితం ప్రసాదించామ‌ని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa