ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 03:58 PM

ఇదే నా రాష్ట్రం..5 కోట్ల ప్రజలే నా కుటుంబం..ప్రజల సంక్షేమమే నా విధానమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. నేను ప్రజలనే నమ్ముకున్నానని, చంద్రబాబులా దత్తపుత్రుడిని, ఎల్లోమీడియాను నమ్ముకోలేదని వెల్లడించారు. జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. జిందాల్‌ కంపెనీ ఆధ్వర్యంలో రూ.8,800 కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే..గతంలోనూ అదే బడ్జెట్‌..ఇప్పుడూ అదే బడ్జెట్‌..గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. గజదొంగల మాదిరిగా దోచుకోవడం, పంచుకోవడమే వారి పని అని వివరించారు. కమలాపురంలో రూ.905 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa