రాష్ట్రంలో మరోసారి రాజకోట కుట్ర జరిగేలా ఉందని ఆంప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అనుమానం వ్యక్తంచేశారు. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు బసపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. గతంలో రాజకోట కుట్రకు ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారని గుర్తు చేశారు. మరోసారి అలాంటి తప్పేదో జరుగుతుందనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఈరోజు కూడా ఏదో జరుగుతోందనే అనుమానం వస్తోందని కోలగట్ల వీరభద్రస్వామి కామెంట్ చేశారు.
అటు చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనపై కోలగట్ల వీరభద్రస్వామి విమర్శలు గుప్పించారు. తన పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పకుండానే జిల్లా పర్యటన సాగిందని విమర్శించారు. విజయనగరం జిల్లా గురించి తర్వాత.. చంద్రబాబు ఫస్ట్ కుప్పంలో గెలవాలని సూచించారు. తాము అవినీతి చేశామని చెబుతున్న చంద్రబాబు.. దాన్ని నిరూపిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని మాయమాటలు చెప్పినా.. ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. ఏపీలో జగన్ అద్భుత పాలన అందిస్తున్నారని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa