ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 06:59 PM

గ్రామ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కోరారు. గురువారం ఓబులవారిపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల నాగమ్మ, వైస్ ఎంపీపీ సుమిత్ర, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa