రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంను గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. కమలాపురం పట్టణం నగర పంచాయతీ పరిధిలోని పడమటి వీదిలో "ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి" కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం మండల టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అవివేక చర్యలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డులో "ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమలాపురం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకుని, పార్టీ ఇచ్చిన అభిప్రాయ సేకరణ పత్రoలో వివరములు సేకరించి, పార్టీ నిర్దేశించిన ఫోన్ నెంబర్ 9261292612 కి మిస్డ్ కాల్ ఇవ్వమని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి, దివాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి దాదిరామయ్య, రాఘవరెడ్డి, నాగేంద్ర, పల్లె రామసుబ్బారెడ్డి, మల్లికార్జున శెట్టి, రామమునిరెడ్డి, అన్వర్ భాష, ఐటీడీపి , అబ్దుల్ నబీ, మెరిన్ ప్రసాద్, ప్రవీణ్, నాయకులు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa