ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 08:08 PM

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే కందుకూరులో 8 మంది అమాయకులు మృతిచెందారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ధ్వజమెత్తారు. ఇరుకు రోడ్డులో సభ పెట్టి, డ్రోన్‌ కెమెరాతో వీడియోలు తీసి.. బాబు సభకు కిక్కిరిసిన జనం అని ఎల్లో మీడియాలో భజన చేయించుకోవాలని చూశాడని, ఆ పబ్లిసిటీ పిచ్చితోనే 8 మందిని బలితీసుకున్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రచార యావ కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, 8 మందిని పొట్టన పెట్టుకున్న బాబును ఏం అనాలని ప్రశ్నించారు. చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, 8 మందిని బలిగొన్న చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కందుకూరు చంద్ర‌బాబు స‌భ‌లో జ‌రిగిన‌వి ముమ్మాటికీ రాజ‌కీయ హ‌త్య‌లేన‌న్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa