సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల దెబ్బకు వ్యాపార రంగం నాశనమైనందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడిపాక హరిప్రసాద్, పాలేటి రామకృష్ణలు ఆరోపించారు. టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, వాణిజ్య విభాగం అధ్యక్షులు గుండి రాకేష్ ఆదేశాల మేరకు చినగంజాం గ్రామంలో బుధవారం జరిగిన ఇదేం ఖర్మ వ్యాపారులకు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మోటుమర్రి రామసుబ్బారావు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్ర్టానికి గోడ పత్రికలను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. తదనంతరం గ్రామంలోని పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పుర వీధులలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక సోపిరాల రైల్వేగేటు సెంటర్లోని ఆర్అండ్బీ రహదారిపై నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. అన్యాయం, అరాచకాలతో సాగుతున్న వైసీపీ పాలనను తరమికొట్టేందుకు ప్రజలు సంసిద్ధులై ఉండాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు పొద వీరయ్య, అబ్దుల్ కలాం అజాద్, నాయకులు యార్లగడ్డ లక్ష్మీ, పద్మ, టీ.జయరావు, రాయని ఆత్మారావు, సందు శ్రీనివాసరావు, బెల్లంకొండ రమే్షబాబు, కోట శివరామకృష్ణ, నరహరి శ్రీనివాసరావు, ఎస్.సుబ్రమణ్యం, దేవతోటి నాగరాజు, కేశనపల్లి శ్యాంబాబు, కే.విష్ణు, షేక్.హుస్సేన్బాష, ఎం.సత్యనారాయణ, చల్లా వెంకటరావు, వి.వెంకయ్య, పీవి శ్రీనివాసరావు, ఆంజనేయులు, శ్రీనివాసరావు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa