రా ష్ట్రంలో ఆస్తులు తాకట్టు పెట్టి పాలన చే స్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా వైసీపీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్పార్టీ కా ర్యాలయంలో ఆ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్య కర్తలు కేక్ కట్చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఏ రోజూ ఓవర్ డ్రాప్ట్కు వెళ్లలేదన్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత ప్రతినెలా ఓవర్ డ్రాప్ట్కు వెళ్లాల్సి వస్తోందన్నారు. లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దారుణమైన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రం విభజన జరిగి ఎనిమిదిన్నర ఏళ్లు అవు తుంటే 70 ఏళ్లకు సరిపడా అప్పులు చేశారని విమర్శించారు. ఇప్పటికే ప్రభు త్వ ఆస్తులన్నీ దాదాపు తాకట్టు పెట్టారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు చెం దిన రూ.10 లక్షలకోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రప్రభుత్వం సామాన్యులపై మాత్రం భారాలు వేస్తోందన్నారు. కాంగ్రె స్ పార్టీ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి రైతును రారాజుగా చేస్తే నేడు కేంద్రంలోను, రాష్ట్రంలోను రైతుల కష్టాలు పట్టించుకునేవారే లేరన్నారు. సుపరిపాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. దేశం అభివృద్ధి సాధించాలన్నా, అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నా ప్రజలు కాంగ్రెస్పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఏపీసీసీ సభ్యుడు షంషీర్; నాయకులు నాగూర్వలి, గిరీష్, రెడ్డిసాహెబ్, వేమయ్య, ఇంతియాజ్, జబీ, నజీర్, శంకర్నాయుడు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa