రైతులకు సేవలందించే సహకార సంఘాల (పీఏసీఎస్) బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. మొవ్వపాలెంలో రూ.33 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ గోడౌన్లను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులకు సహకార సంఘాలు అందిస్తున్న సేవలను చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు వివరించారు. సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగపర్చుకోవాలని చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు. పీఏసీఎస్ చైర్పర్సన్ చలమలశెట్టి బ్రహ్మయ్య, సర్పంచ్ చలమలశెట్టి శివకుమారి, చలమలశెట్టి సాంబశివరావు, ఎంపీటీసీ సభ్యుడు సమ్మెట ఆంజనేయులు, ఎంపీపీ కొండేటి ఇందిర, జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి పార్వతి, పీఏసీఎస్ కార్యదర్శి వడ్డి జగదీష్, తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa