బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 3 రోజులుగా దూసుకుపోతోన్న బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.300 నుంచి రూ.330 వరకు పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,930 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్పై సుమారు రూ. 1000 మేర పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa