అర్ధరాత్రి ఆరుబయట వేడుకలకు అనుమతులు లేవు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 సి. ఆర్. పి. సి. అమలులో ఉన్నందున బహిరంగ ప్రదేశాలలో ఐదుగురు అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడటం నిషేధం రాష్ట్ర డిజిపి నేడు శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కొత్త వేరియంట్ 'ఓమిక్రాన్' BF-7 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంక్షలు తప్పనిసరిఅని ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాన రహదారులైన బందరు రోడ్, ఏలూరు రోడ్, బి. ఆర్. టి. ఎస్. రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించబడును. అదేవిధంగా బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ పై ఓవర్ మరియు పి. సి. ఆర్. ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ అనుమతిచబడదు.
క్లబ్బులు, రెస్టారెంట్లలో వేడుకలు నిర్వహించుకొనుటకు ముందస్తు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలిఅనీ నిర్వాహకులు సామాజిక దూరం మరియు ఇతర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సీటింగ్ కెపాసిటీలో 60 శాతం వరకు మాత్రమే అనుమతించేటట్లు నిబంధనలు పాటించాలి. ఆరుబయట ప్రదేశాలలో డి. జె. లు మరియు ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సౌండ్ సిస్టంను వినియోగించరాదు. మద్యం సేవించి రోడ్లపై వాహనములు నడుపరాదు, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును. గుంపులు, గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగ రాదు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకునేటప్పుడు మాస్కులు, శానిటైజర్లు వాడుతూ నిబంధనలు పాటించాలి ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa