జమ్మూలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మా వైష్ణో దేవిని ఆలయాన్ని 2022 సంవత్సరంలో 91 లక్షలకు పైగా భక్తులు సందర్శించారు. ఈ గణాంకాలు గత 9 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాయి. నూతన సంవత్సరం రోజు 23,000 మందికి పైగా భక్తులు త్రికూట కొండలపై ఉన్న వైష్ణో దేవి ధామ్కు దర్శించుకున్నారు. 2022 సంవత్సరంలో వైష్ణో దేవి ఆలయంలో 91.25 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు CEO అన్షుల్ గార్గ్ వెల్లడించారు. వైష్ణో దేవి ఆలయంలో భక్తుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ 2013లో ప్రారంభమైంది. అప్పటినుండి ఆలయానికి భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa