సీఎం స్థాయిలో ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన టీడీపీ కార్యకర్తలపై శవ రాజకీయాలు చేయటం జగన్ మానుకోవాలని శ్రీశైలం మాజీ ఎంఎల్ఏ బుడ్డా రాజశేఖరరెడ్డి హితవు పలికారు. మండలంలోని సంతజూటూరు గ్రామంలో అనారోగ్యంతో ఉన్న టీడీపీ నాయకుడు గొల్ల తిరుపాల్, కార్యకర్త ఎర్రన్నలను ఆయన పరామర్శించారు. అనంతరం పరమటూరు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చేపల పుల్లయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. బుడ్డా మాట్లాడుతూ..... నెల్లూరు జిల్లా కందుకూరులో మాజీ సీఎం చంద్రబాబు పర్యటనలో తొక్కిసలాట జరిగి దురదృష్టవశాత్తు కార్యకర్తలు చనిపోతే సీఎం నర్సీపట్నంలో తన ప్రసంగంలో శవ రాజకీయాలు మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి అద్దంపడుతోందన్నారు. కుంటి సాకులు పెట్టి ఎన్నో ఏళ్ళుగా ఫింఛన్లు తీసుకుంటున్న నిరుపేదల కడుపు కొట్టే కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టి తన చేతగాని తనాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. ఈ నెలలో జీతాలు ఇవ్వలేక పోవటంతో ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారని, పాలన చేతకాక ఆర్థికంగా చతికల పడ్డారన్నారు. టీడీపీ మండల నాయకులు ఎన్ నరసింహారెడ్డి, సర్పంచ్ ఎలగల రామచంద్రుడు, తాటికొండ బుగ్గరాముడు, ఎం కృష్ణారెడ్డి, హిమాంసా, చిన్నప్వామి, రామకృష్ణ, జాకీర్ఖాన్, మళ్ళేశ్వరరెడ్డి, నందయ్య, సాయిబాబారెడ్డి, శేఖర్, చాంద్బాషా, శివరామిరెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa