పెద్దపప్పూరు: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. నామనాంకపల్లి, నారాపురం గ్రామాల్లో మంగళవారం ఆయన అధికారులు, నాయకులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడప వద్దకూ వెళ్లి ప్రభుత్వం అందించిన లబ్ధిని వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేను కలవాలంటే నాయకులు పలుకుబడి ఉంటేనే సాధ్యమయ్యేదన్నారు. ప్రస్తుతం జగనన్న ప్రభుత్వంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్న ఉద్దేశం తో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు స్వయంగా ఇంటి వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణం పరిష్కరిస్తున్నారన్నారు. కుల, మత రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారున్నారు. తాను నియోజకవర్గంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందబాటులో ఉంటానని, ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa