ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి అడ్డుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 06:54 PM

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... చట్టవిరుద్ధంగా తమ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని... తమ వాహనాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. జగన్‌లో భయం పుట్టుకొచ్చిందన్నారు. ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోలీసులు ముందుకు రావాలన్నారు. తప్పు ఎవరు చేసినా సరిదిద్దుకోవాలని సూచించారు. తెలుగుజాతి కోసం త్యాగాలు చేసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. 5 కోట్ల మంది బాధపడుతుంటే శాడిస్ట్ సీఎం ఆనందపడతారని వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా నేరస్తులే అని... డీఎస్పీ ప్రజలకు సర్వెంటా.. వైసీపీకా అని బాబు ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa