ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందులలో గెలిచి బోణీ చేయగలరా....?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 06:56 PM

ప్రజల దగ్గరకు వెళ్ళే‌హక్కు ప్రతీ పార్టీకి ఉందని విజయవాడ  తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్  అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద జీఓ - 1 కాపీలను ఎమ్మెల్యే తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చీకటి జీవో కనుక తాము ఈ జీఓను తగులబెడుతున్నామన్నారు. చంద్రబాబు సభలకు లక్షలాది మంది వస్తున్నారని అన్నారు. యువగళం కార్యక్రమానికి జడిసి ఇలా చేస్తున్నారని విమర్శించారు. జీఓ-1 ను రద్దు చేయాలని, తక్షణమే నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులివెందులలో గెలిచి బోణీ చేయగలరా అంటూ గద్దె రామ్మోహన్ సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa