ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సలహాదారుల వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 05:53 PM

యధా సీఎం - తథా పోలీస్‌ అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు  వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై మహిళలు హత్యాయత్నం చేశారని కేసులు పెట్టారని... బ్రిటిష్ కాలంలో కూడా పోలీసులు ఇంత దయనీయస్థితికి దిగజారలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు అంటే ఏమిటో ఏపీ పోలీసుల కు తెలుసా అని ప్రశ్నించారు. సీఎంవో  చెప్పిందని చెత్త చెత్త కేసులు పెట్టవద్దని హితవుపలికారు. తనపై ఎన్ని కేసులు పెట్టారని డీజీపీ కి లేఖ రాస్తే వివరణ ఇవ్వలేదన్నారు. త్వరలో నిజమైన ప్రజాప్రభుత్వం వస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సలహాదారుల వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పయ్యావుల కేశవ్‌ నియోజకవర్గంతో ఓట్లు తీసేశారని ఈసీకి ఫిర్యాదు వెళ్లిందని... టీడీపీ ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని రఘురామ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa