ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల్లో గిన్నిస్ రికార్డ్ సాధించిన ఘనుడు జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 05:54 PM

జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రానికి గానీ, ప్రజలకు గానీ ఒరిగింది ఏమీలేదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలన లో ప్రజలకు అప్పుల భారమే మిగిలిందని చెప్పుకొచ్చారు. ‘‘రాష్ట్ర అప్పుల్ని 10 లక్షల కోట్లకు చేర్చి.. అప్పుల్లో గిన్నిస్ రికార్డ్  సాధించిన ఘనుడు జగన్. అప్పుల భారం ప్రజలపై, ఆ సొమ్ముతో సకల భోగాలు అనుభవిస్తున్నది మాత్రం జగన్.. ఆయన మంత్రులు, సలహాదారులే. సలహాదారులకు నాలుగేళ్లలో జగన్ రూ.145 కోట్లు తగలేశారు. రెడ్లకు దోచిపెట్టడానికే జగన్ సలహాదారుల వ్యవస్థ తీసుకొచ్చారు. తనవాళ్లే అవినీతి కేసులు, ఆర్థిక నేరాల నుంచి తనను రక్షిస్తారన్న ప్రగాఢ నమ్మకంతో జగన్ రెడ్డి ఉన్నారు. సలహాదారుల వ్యవస్థను హైకోర్టు తప్పుపట్టినా జగన్ లెక్కచేయడం లేదు. మంత్రుల్లో కూడా రెడ్లకు ఉన్న ప్రాధాన్యత ఇతర వర్గాలవారికి లేదు. ‘నాడు-నేడు’ పేరుతో రూ.10 వేల కోట్లు, ఇసుక దోపిడీతో, మద్యం అమ్మకాలతో రూ.40 వేల కోట్లు, సెంటు పట్టాభూముల పేరుతో రూ.10 వేల కోట్లు తన వంది మాగధులకు దోచిపెట్టారు. విచ్చలవిడిగా సాగుతున్న తన దోపిడీ, ప్రజా సొమ్ము భక్షణ గురించి చంద్రబాబు జనానికి చెబుతున్నారన్న అక్కసుతోనే జగన్ జీవోనెం-01 తెచ్చారు.’’ అని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa