ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలానుగుణ వ్వాధుల పై అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 07:07 PM

రాయదుర్గం: కే. టీ. ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల మహిళా సాధికారత విభాగం మరియు మైక్రో బయాలజీ సంయుక్త ఆధ్వర్యంలో కాలానుగుణ వ్యాధులు పై అవగాహన కార్యక్రమం నిర్వహించడమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయదుర్గం ఏరియామలేరియా సంబంధించి సబ్ యూనిట్ ఆఫీసర్ తిరుపాల్ నాయక్ హాజరైనారు. విద్యార్థిని, విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. తిరుపాల్ నాయక్ గారు విద్యార్థిని, విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ, జ్వరం రెండు మూడు రోజులు తగ్గకపోతే లక్షణాలనుబట్టి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గునియాకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలనీ, నియోజకవర్గ పరిధిలో ప్రతి స్కూలు, కళాశాల ల్లో వెళ్లి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేస్తున్నామని, నిర్లక్ష్యంతో చిన్న పాటి జ్వరానికి లక్షలు ఖర్చు చేయడం సరైనది కాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa