తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనను వివిధ రకాల ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకోవడం దారుణం అని తెలుగుదేశం పార్టీ నాయకుడు గోరుశెట్టి బాబు పేర్కొన్నారు. శుక్రవారం కొండాపురం మండలం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణం నందు కల్లకు నల్ల గంతలు కట్టి చీకటి జీఓ అయిన జీఓ నెం. 1 ప్రతులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండటంతో ఓర్వలేక ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింత సానుభూతి పెరుగుతుందని 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీకి పతనం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, రవికుమార్, రామ్మోహన్, నాగిరెడ్డి, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa