శ్రీవేంకటేశ్వరస్వామి తన దేవేరులతో కలిసి పాల్గొనే ప్రణయ కలహోత్సవం శనివారం తిరుమలలో జరగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకిపై వేర్వేరుగా వైభవోత్సవం మండపం నుంచి ఊరేగింపుగా బయల్దేరి వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేర్వేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. తర్వాత అమ్మవార్లు స్వామిని నిందాస్తుతి చేశాక ఒకరిపై ఒకరు పూలబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రయణకలహ మహోత్సవం నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa