ఇండియన్ రైల్వే ఊళరైల్ ఆధ్వర్యంలో శక్తి పీఠాల యాత్ర ఈనెల 16న ప్రారంభమవుతుందని ఊళరైల్ మార్కెటింగ్ మేనేజర్ విఘ్నేష్ తెలిపారు. మధురై నుంచి నెల్లూరు మీదుగా గుంటూరు చేరుతుందని, 13 రోజుల పాటు కామాఖ్యాదేవి, వారణసీ, కోల్కతా, అలహాబాద్, గయ, పూరి, కోణార్క్ ప్రాంతాల్లో కొనసాగుతుందని తెలిపారు. భోజనం, వసతి, టూర్ మేనేజర్, సెక్యూరిటీ గల ప్యాకేజ్ స్లీపర్ క్లాస్ ఒకరికి రూ.19,950, ధర్డ్ఏసీ రూ.26,300 ఉంటుందని, నెల్లూరు, ఒంగోల్, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్లో బోర్డింగ్ పాయింట్లని తెలిపారు. 93848 03557, 74167 18800లో సంప్రదించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa