ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమలాపురం లో ఈనెల 22న జాతీయస్థాయి చిత్రకళాప్రదర్శన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 02:15 PM

 కోనసీమ చిత్రకళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 22న జాతీయస్థాయి చిత్రకళాప్రదర్శన అమలాపురం శ్రీసత్యసాయికల్యాణ మండపంలో జరుగుతుందని చిత్రకళాపరిషత్‌ వ్యవస్థాపక కార్యదర్శి కొరసాల సీతారామస్వామి తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో చిత్రకళాప్రదర్శన నిలుపుదల చేసినప్పటికీ పోటీలు మాత్రం యథాతఽథంగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన చిత్రకారులు తమ కుంచెల నుంచి జాలు వారిం చిన చిత్రాలను తపాలా శాఖ ద్వారా చేరవేయుంచారు. దాంతో గత రెండేళ్లుగా నిలిచిన చిత్రకళా ప్రదర్శన ఈ ఏడాదితో కలుపుకుని 31, 32, 33వ జాతీయ చిత్రకళా ప్రదర్శన ఒకే వేదికపై ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. విభిన్న కళారీతులను అనుసరిస్తూ దేశవ్యాప్తంగా పేరొందిన వందలాది మంది చిత్రకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. పంజాబ్‌, హర్యానా, ముంబై, ఢిల్లీ, కోల్‌కొత్తా, బెంగుళూరు, చెన్నై, రాయచూర్‌, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన చిత్రకారుల పెయింటింగ్స్‌ ఈ ప్రదర్శనలో ఉంచుతారు. ఇక జాతీయస్థాయి చిత్రకళాప్రదర్శనను అదేరోజు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ప్రారంభిస్తారు. జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి లోగో ఆవిష్కరిస్తారు. హైదరాబాద్‌ శ్రీవెంకటేశ్వరా కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.అజిత జ్యోతిప్రజ్వలనతో చిత్రకళా ప్రదర్శన ప్రారంభమవుతుంది. జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో పేరొందిన చిత్రకారులు పాల్గొంటారు. అదేరోజు మూడేళ్లలో విజేతలందరికీ బహుమతులు అందజేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa