ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల్లో తిరగడానికి వీల్లేదు, జేసీ ప్రభాకర్‌రెడ్డి కి ఆంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 02:20 PM

మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి జేసీ అశ్మితరెడ్డి వార్డు పర్యటనను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా జేసీ అశ్మితరెడ్డి పట్టణంలోని 1వ వార్డు పర్యటనకు వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జీవో నెం.1 ప్రకారం అనుమతులు లేకుండా పర్యటించకూడదని అన్నారు. దీంతో తాను జనాలతో కలిసి వెళ్లడంలేదని, ఐదారుగురితో కలిసి వెళుతున్నానని అన్నారు. దీనికీ నిబంధనలు అడ్డువస్తే ఒక్కడినే వెళతానని అన్నారు. కానీ పోలీసులు వినకుండా బలవంతంగా ఆయనను వాహనం ఎక్కించి ఇంటికి పంపించారు. విషయం తెలుసుకున్న జేసీపీఆర్‌, 1వ వార్డు పర్యటనకు వెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో చైర్మన, కౌన్సిలర్లు పర్యటించడానికి అనుమతి అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు గడపగడపకు వెళ్లడానికి అనుమతులు ఉన్నాయిగాని, మున్సిపల్‌ చైర్మన స్థాయిలో తాను వెళ్లడానికి నిబంధనలు అడ్డువచ్చాయా అని ప్రశ్నించారు. అయినా పోలీసులు వినకపోవడంతో వారిని తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అనంతరం పోలీసుల తీరుపై నిరసన తెలిపి జేసీ ప్రభాకర్‌ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa