రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తున్న జగన్ సైకో పాలనకు యువత చరమగీతం పాడాలని టీడీపీ అమలాపురం, కాకినాడ అసెంబ్లీ ఇన్చార్జిలు అయితాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు పిలుపు నిచ్చారు. ఎన్.కొత్తపల్లిపంచాయతీ రాఘవులపేట అగ్నికుల క్షత్రియ గ్రామంలో ఆదివారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో నిర్వహించిన రచ్చబండలో వారు మాట్లాడుతూ ఎమర్జెన్సీని మించిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే హింసించడం, ప్రతి అంశంలోను కోర్టు ధిక్కారం ముఖ్యమంత్రికి నిత్యకృత్యాలుగా మారాయని విమర్శించారు. కోలా శ్రీను, కర్రి నాగరాజు, మల్లాడి లక్ష్మణ్, ఓలేటి సత్తిబాబు, రచ్చ సురేష్, కాటా దొరబాబు సహా సుమారు ఇరవై మంది అగ్నికుల క్షత్రియ యువకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆనందరావు, కొండబాబు వారికి పార్టీ కండువాలు కప్పారు. టీడీపీ మండల శాఖ అధ్య క్షుడు అరిగెల నానాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, టీడీపీ అగ్నికుల క్షత్రియ సాధికార సమితి జిల్లా కన్వీనర్ లంకే భీమరాజు, టీడీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు గుత్తుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, తెలుగు రైతు అధ్యక్షుడు పెమ్మిరెడ్డి సత్యనారాయణ, మల్లాడివెంకటరమణ, రవణం మధు, అరదాని ధర్మారావు, అరదాని శ్రీను, మధుర ప్రతాప్, మల్లాడి శ్రీరాములు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa