ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 04:15 PM

కదిరి పట్టణంలోని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి ఉపాధ్యాయ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ స్వామి వివేకానంద తమ చివరి కాలంలో , తమ ప్రియ శిష్యులు శరత్ చంద్రతో అంటారు. " శరత్ ఈ దేహాన్ని ఉమ్మి వలె విసర్జిస్తున్నా". ప్రియమూ. శాశ్వతమూ నిత్యమూ అని దేహ బ్రాంతి పెంచి పోషించుకునే మనకు ఈ మాటలు చాలా చిత్రంగా తోస్తాయి. అలా తృణ ప్రాయంగా ఈ దేహాన్ని విడువ గలిగితే యోగి కాక మరి ఎవడు? అని తెలిపారని భయం లేని వారు ఆత్మవిశ్వాసం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరు అని, నీ ముందు ఏముంది? నీ వెనుక ఏముంది అనేది అనవసరం నీలో ఏముందనేది నీకు ముఖ్యం ఇలాంటి మాటలు ప్రేరణ కలిగించేలా వుంటాయి అని తెలిపారు. ఈకార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలి , యస్. టి. యు జవహర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి గౌస్ లాజమ్, తలుపుల రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa