ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శోభాయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 04:20 PM

స్వామి వివేకానంద జన్మదిన పురస్కరించుకొని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 1000 పైగా విద్యార్థులతో శోభయాత్ర ను నిర్వహించారు. ఈ శోభయాత్రను తాడిపత్రి డి. ఎస్. పి చైతన్య, పట్టణ సీఐ ఆనందరావు జెండా ఊపి ప్రారంభించారు. తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నుంచి అశోక్ పిల్లర్ వరకు వివేకానందుని పాటలతో, వేషధారణతో శోభ యాత్ర కొనసాగించారు, ఈ శోభయాత్రలో దారి పొడవునా స్థానికులు పూలు చల్లి శోభ యాత్రను స్వాగతించారు. వివేకానందుని జీవితం ఆదర్శమని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలకు తెలియజేసినటు వంటి మహోన్నతమైన వ్యక్తి అని ఎంఈఓ, పాఠశాలల కరెస్పాండెట్ లు, తెలియజేశారు. ఏబీవీపీ సంఘం మంత్రి చిన్నా శ్రీరామ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకుని వివేకానందుని మాటను ఏబీవీపీ బాట గా తీసుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేస్తుందని తెలియజేశారు. జిల్లా కన్వీనర్ అఖిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద కోరుకున్నటువంటి ఇనుప కండరాలు ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన మనసు, శరీరం ఉన్న వ్యక్తులు లాగా విద్యార్థులందరూ నిర్మాణం కావాలని తెలియజేశారు, కార్య క్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు, భాగ్ కన్వీనర్ భూపాల్, నగర కార్యదర్శి హరి నారాయణ, నాయకులు కేశవబాబు, మనోజ్, మంజునాథ్ రెడ్డి, నరసింహ, మంజు, హాజి, భాను, హర్ష, పాఠశాలల కరెస్పాండెంట్లు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa