ఒకపుడు తనపై విషయ ప్రయోగం జరిగిందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇదిలావుంటే మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో చిరంజీవి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఒక ఛానల్ తో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఒక ఘటనను వివరించారు.
1988లో 'మరణ మృదంగం' సినిమా షూటింగ్ ఔట్ డోర్ లో జరుగుతోందని... ఆ సందర్భంగా సెట్స్ లో కేక్ కట్ చేశామని చెప్పారు. ఒక అభిమాని తనకు స్వయంగా కేక్ తినిపించాడని, తనకు స్పూన్ తో కేక్ తినే అలవాటు లేదని... ఆ అభిమాని కూడా చేత్తోనే కేక్ తినిపించాడని... అయితే కేక్ తనకు చేదుగా అనిపించిందని తెలిపారు. వెంటనే కేక్ ను తాను ఊసేశానని... పక్కనే ఉన్న చిత్ర నిర్మాత కేఎస్ రామారావుకి అనుమానం వచ్చిందని... అభిమానిని పట్టుకుని, కేక్ ను పరీక్షకు పంపించారని చెప్పారు. కేక్ లో ఏదో కలిపారని తెలయడంతో అతన్ని కేఎస్ రామారావు కొట్టారని, దీంతో అతను నిజాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు. కేరళ నుంచి వశీకరణ పదార్థాన్ని తెచ్చి, తినిపించే ప్రయత్నం చేశానని చెప్పాడని అన్నారు. అయితే అతన్ని ఏమీ చేయొద్దు వదిలేయమని తాను చెప్పడంతో కేఎస్ రామారావు వదిలేశారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa