ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా: మంత్రి ఆర్.కే.రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 15, 2023, 05:34 PM

బాలకృష్ణ ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్థం కావట్లేదని మంత్రి ఆర్.కే.రోజా పేర్కొన్నారు. బాలకృష్ణ గత ప్రభుత్వ పనితీరు చూసి ఇంకా అదే విధంగా ఉందనే అనుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలన్నారు. బాలయ్యకు స్ర్కిప్టులు రాసి ఇచ్చినా మాట్లాడలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.


బావ చంద్రబాబునాయుడు కళ్లలో ఆనందం కోసం బావమరిది నందమూరి బాలకృష్ణ పరితపిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఎద్దేవా చేశారు. వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. దీంతో, బాలయ్య డైలాగ్స్‌పై మంత్రి రోజా మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా.. ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. కుటుంబ సబ్యులతో కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి రైతుల పండుగ అని.. రైతులు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని మంత్రి చెప్పారు. వైఎస్సార్ కుటుంబ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటారన్నారు.


ఇక, రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పరిపాలన ఉందని బాలయ్య చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా తీవ్రంగా తప్పుబట్టారు. 


చంద్రబాబు సభల వల్ల 11 మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని మంత్రి రోజా ప్రశ్నించారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ జీవో నంబర్ 1ని పూర్తిగా చదివారా అని నిలదీశారు. జగనన్న ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తన అల్లుడు, కూతురు బాగుండాలని తన బావ మెప్పుకోసం ఇలా మాట్లాడి ఉండొచ్చని సెటైర్లు వేశారు.


అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రాంలో ఎన్టీఆర్‌పై జరిగిన చర్చను ప్రజలందరూ ఇదో స్ర్కిప్ట్ అని భాస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు మోసాన్ని కప్పిపుచ్చేలా షో నడిపారన్నారు. ఎవరు చచ్చినా పర్వాలేదు.. తన బావ మీటింగ్ జరగాలి, బావ కళ్లలో ఆనందం చూడాలని బాలకృష్ణ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. బాలకృష్ణకు ప్రజల కష్టాలు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా అని నిలదీశారు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa