నన్ను మన్నించండి అంటూ దేవబ్రాహ్మణులకు హిందూపుుర్ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఓ బహిరంగ లేఖలో విన్నవించుకొన్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో దుమ్మురేపుతున్నాడు. సంక్రాంతి వేళ రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. కాగా.. ఇదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీయగా.. వాటిపై స్పందించారు. నిన్ననే.. సినిమాలోని పొలిటికల్ డైలాగులపై స్పందించిన బాలయ్య.. దేవబ్రాహ్మణులపై చేసిన కామెంట్లపై స్పందించారు. పొరపాటున ఆ మాటలు అన్నానని.. తనను మన్నించాలంటూ బాలయ్య బహిరంగ లేఖ విడుదల చేశారు. దేవాంగుల నాయకుడు రావణ బ్రహ్మ అని తాను అన్న మాట వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధ పడ్డానంటూ లేఖలో తెలిపారు బాలయ్య. దేవ బ్రాహ్మణుల నాయకుడు రావణుడని తనకందిన సమాచారం తప్పని చెప్పిన పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తనకు ఎవరీని బాధపెట్టాలన్న ఆలోచన లేదని.. ఉండదని కూడా తెలుగు ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని క్లారీటీ ఇచ్చారు. పైగా దేవాంగులలో తనకు చాలా మంది అభిమానులున్నారన్న బాలయ్య.. నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా అంటూ ప్రశ్నించారు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని.. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్టు బహిరంగ లేఖలో బాలయ్య వివరించారు.
‘వీరసింహారెడ్డి’ సినిమాలో సంభాషణలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో కాదో ప్రజలకు తెలుసని బాలయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఒక ఓటరుగా తన అభిప్రాయాలు చెబుతున్నానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa