ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నత హోదాను మరించి...అమాయక విద్యార్థినీలపై పశువులా ప్రవర్తించాడు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 15, 2023, 05:33 PM

చిన్న పిల్లలపై రోజురోజుకు లైంగిక దాడులు పెట్రేగిపోతున్నాయి. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పశువులా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే విచక్షణ మరిచి విద్యార్థుల పట్ల కీచకునిలా మారాడు. 52 ఏళ్ల వయసున్న ఉపాధ్యాయుడు ఏకంగా 26 మంది విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన కేరళలోని కన్నూర్‌లోని ఎయిడెడ్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావటంతో.. వెంటనే ఆ కీచక టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. నవంబర్ 2021 నుంచి అరెస్ట్ చేసేంత వరకు మొత్తంగా 26 మంది విద్యార్థులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బయటకు చెప్తే ఏం జరుగుతుందో అని ఇన్ని రోజులు మౌనంగా ఆ ఉపాధ్యాయుని వేధింపులు భరించిన బాలికలు.. ధైర్యం చేసి ముందుకొచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయగా.. అతని బాగోతం బయటపడింది. ఇటీవలే ఓ విద్యార్థిని తాను ఎదుర్కొన్న వేధింపులను పాఠశాలలోని మరో ఉపాధ్యాయుడికి వివరించింది. దీంతో.. ఆ కీచక టీచర్ నిజస్వరూపం తెలిసింది. వెంటనే.. జిల్లా చైల్డ్ లైన్ అధికారులు ఫిర్యాదు చేయగా.. జనవరి 12న పోక్సో చట్టం కింద ఆ ఉపాధ్యాయున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.


అయితే.. ఒక అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగు చూసినా.. చాలా మంది విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని వేధింపులు భరించారన్న అనుమానంతో పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ తరువాత ఆ కీచకుడు తమపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ చాలా మంది విద్యార్థులు ధైర్యంగా చెప్పారు. కోవిడ్ తర్వాత పాఠశాలలు తెరిచినప్పటి నుంచి నిందితుడు వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఫిర్యాదుమేరకు జనవరి 12న ఐదు కేసులు.. శనివారం మరో 21 కేసులు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa