వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే.. పాకిస్థాన్ హైకమిషన్ అధికారి ఒకరు తన కోరిక తీర్చాలని వేధించారని పంజాబ్కు చెందిన ఓ యువతి ఆరోపించారు. ఇబ్బందికర ప్రశ్నలు వేస్తూ తన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. వీసా ఇంటర్వ్యూ కోసం రెండుసార్లు వెళితే.. రెండు సార్లు ఇలాగే జరిగిందని పంజాబ్కు చెందిన ఆ యువతి చెప్పుకొచ్చారు. గత ఏడాది జూన్లో జరిగిన ఈ ఘటన గురించి పాక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్కు లేఖ రాశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
‘నేను మార్చి 2021, గత సంవత్సరం జూన్లో న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్కు వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్లాను. నన్ను లాంజ్లో చాలా సేపు వెయిట్ చేయించారు. ఆ తర్వాత నాకు వీసా మంజూరు చేయలేమని చెప్పారు. నాడు పాకిస్థాన్లో పరిస్థితి బాలేదు. నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. పాకిస్థాన్ ప్రభుత్వం స్థిరంగా లేదు’ అని బాధితురాలు చెప్పుకొచ్చారు.
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ | రిఫ్రిజిరేటర్లు, మైక్రో వేవ్స్, వాషింగ్ మెషిన్లు మొదలగు అప్లయన్సెస్పై 65% వరకు తగ్గింపు
నేను కార్యాలయం నుంచి బయటకు వెళ్తుండగా.. పాక్ హైకమిషన్లో పనిచేసే ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అతడి పేరు ఆసిఫ్. మీరు నా దగ్గరకు వచ్చి ఉంటే, మీకు వీసా చేయించేవాడిని అన్నాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీసా అధికారి వస్తారని చెప్పి, నన్ను మళ్లీ లాంజ్లో వెయిట్ చేయించాడు’ అని ఆమె తెలిపారు.
కాసేపటి తర్వాత తనను ఓ గదిలోకి పిలిచిన సదరు అధికారి.. అనుచిత ప్రశ్నలు వేశాడని బాధితురాలు వెల్లడించారు. ‘అతడు నా వీసా అవసరం గురించి అడిగాడు. నాతో సాధారణంగా మాట్లాడటం ప్రారంభించాడు. నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను. మీకు పెళ్లైందా అని అడిగాడు. నేను ఇంకా కాలేదని చెప్పా. బోర్ కొడితే తాము నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటామని అతడు చెప్పాడు. ఆపై పెళ్లి ఎందుకు చేసుకోలేదని అతడు అడిగాడు. అంతటితో ఆగకుండా మీరు మీ లైంగిక కోరికను ఎలా తీర్చుకుంటారు? అని అడిగాడు. నేను చాలా ఇబ్బందికి గురయ్యా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
మీతో కలిసి బయటికి వెళ్లేందుకు ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరితోనైనా లైంగిక సంబంధం ఉందా? మీకు వివాహేతర సంబంధం ఉందా? అంటూ ఆ అధికారి తనను అడిగాడని బాధితురాలు లేఖలో పేర్కొన్నారు. విసిగిపోయిన తాను పైకి లేచి వీసా అధికారిని పిలవమని అడిగానని తెలిపారు. భారత్కు, కాశ్మీర్కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కథనాలు రాయాలని పాక్ హైకమిషన్కు చెందిన అధికారి తనను కోరారని ఆ మహిళ ఆరోపించారు. తనకు డబ్బు ఆశజూపారని తెలిపారు..
పంజాబ్లోని ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సదరు మహిళ 2021లో పాకిస్థాన్లోని ఓ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లడానికి వీసా కోసం ప్రయత్నించారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో వీసా ఇంటర్వ్యూ కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ కోసం అక్కడకు వెళ్తే.. తనకు ఎదురైన అనుభవం గురించి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa