మనదేశంలో మానవ మృగాళ్లు లు ఇంకా రెచ్చిపోతునే ఉన్నారు. క్లాస్మేట్తో కలిసి సరదాగా బయటకు వచ్చిన కాలేజీ విద్యార్థినిపై ఆరుగురు మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. బాయ్ ఫ్రెండ్ను కొట్టి, బంధించి.. అతడి కళ్ల ముందే ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తమిళనాడులోని కాంచీపురంలో గురువారం (జనవరి 12) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంచీపురానికి చెందిన 20 ఏళ్ల ఓ అమ్మాయి గురువారం సాయంత్రం తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బైక్పై సరదాగా తిరిగేందుకు బయటకి వచ్చింది. వారిద్దరూ నిర్మానుష్యమైన ఓ ప్రాంతంలో బైక్ ఆపి మాట్లాడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు గమనించారు. మాస్కులు ధరించి వాళ్ల వద్దకు వచ్చారు.
యువతి బాయ్ ఫ్రెండ్ను కొట్టి, అతడిని తాళ్లతో కట్టి పడేశాడు. ఆ తర్వాత మరో నలుగురు అక్కడికి వచ్చారు. యువతిని చీకటి ప్రాంతానికి తీసుకెళ్లి మెడపై కత్తి పెట్టి, సహకరించకపోతే చంపేస్తామంటూ బెదిరించి, ఒకరి తర్వాత మరొకరు తమ రాక్షస కోరిక తీర్చుకున్నారు. యువకుడు ఎంతగా ప్రాధేయపడినా ఆ రాక్షసులు కనికరించలేదు. నిందితులు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరినీ బీచ్లోనే వదిలేసి దుండగులు పరారయ్యారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa