మాయమాటలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోస్టార్ జగన్మోహనరెడ్డికి ప్రజలు బుద్ధిచెప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఈదులగూడెంలో ఎన్టీఆర్ విగ్రహ పునః ప్రతిష్ఠ, వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించి బాదుడే బాదుడుకు సైకో రంగం సిద్ధం చేశాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో సైకోతోపాటు పెదపాలేరు సజ్జల కలసి సాయంత్రానికి జె–ట్యాక్స్ లెక్కలు చూసుకోకపోతే వారికి నిద్రపట్టదన్నారు. రూ. 10 వేల కోట్ల పంచాయతీల నిధులను జగన్ మింగేశాడని మండిపడ్డారు. నియోజకవర్గానికి ఒక సైకోను జగన్ తయారు చేశాడని, నూజివీడుకు ఎమ్మెల్యే కుమారుడు చంటినాయన అనే సైకోను తయారు చేశాడని ఈయన కలెక్షన్ కింగ్లా తన ఇంటి గోడమీద అన్నింటికి రేట్లు రాసి ఉంచుతాడని ఎద్దేవా చేశారు. ఈ నాయకులకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పి తీరతామని హెచ్చరించారు. చెత్తకాగితాల్లాంటి జీవోలతో పసుపు సైనికులను అడ్డుకోలేరని వారికి అడ్డువస్తే బ్రేకుల్లేని బుల్డోజర్లలా తొక్కుకుంటూ వెళతారన్నారు. రాష్ట్ర మంత్రులు బఫూన్లలా మీసాలు తిప్పుతున్నారని, అవినీతి బురదలో దొర్లాడే వారికి మీసం మెలేసే అర్హత లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa