మాట తప్పి మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు. రాజోలునియోజకవర్గ పరిధిలోని ములికిపల్లి, కూనవరంలో గ్రామశాఖ అధ్యక్షుడు సోమిశెట్టి ప్రకాశరావు, చెల్లింగి జానకిరామయ్యల ఆధ్వర్యంలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి గొల్లపల్లి, పరిశీలకునిగా చిటికెల రామ్మోహ నరావులు పాల్గొని 1200 కుటుంబాలను కలుసుకుని ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అనంతరం జరిగిన రచ్చ బండ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ.... మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని అసమర్థ పాలన అందిస్తున్నారన్నారు. ఎంపీపీ కేతా శ్రీను, మాజీ ఎంపీపీ అనుచూరి సునీత, మాజీ సర్పంచ్లు అనుకూరి పురుషోత్తం, కలిగితి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, బందెల పద్మ, మోకా పార్వతి, కడలి పద్మ, కడలి శ్రీను, గుబ్బల వెంకటేశ్వరరావు, శీలం బుజ్జి, కడలి సత్యనారాయణ, ఇంగువ చంద్రశేఖర్, కంచి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa