జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అయిన లోకేష్ పాదయాత్రకు తాము ఎందుకు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రతో ఏదేదో జరిగిపోతుందని భ్రమలో ఉన్నారన్నారు. పాదయాత్రలో మొదటి రోజే వాళ్ళకి అంతలేదు అని అర్థం అయిపోతుందని రోజా విమర్శించారు. లోకేష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అన్ని విధాలుగా దెబ్బతిన్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందనడం శుభపరిణామమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa